ఎంపీడీఓలపై విచారణ
గుంటూరు : ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడి నిధులు దుర్వినియోగం చేసారనే కారణాలతో సస్పెండైన ఎంపీడీఓపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ చంద్రమౌళీ జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణ్ లకు ఉత్తర్వులు జారీ చేసారు. దీంతో బొల్లాపల్లి ఎంపీడీఓ డి రాంబాబు, బెల్లంకొండ ఎంపీడీఓ ఎన్ ఉమా, నగరం ఎంపీడీఓ శ్రీనివాసరావులపై విచారణ జరిపేందుకు సీఈఓ సిద్దమవుతున్నారు.
News Posted: 21 January, 2010
|