28న ఐటీ టవర్ ప్రారంభం
విజయవాడ : కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి రోశయ్య పర్యటన సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. గన్నవరంలో ఏర్పాటు చేసిన ఐటీ పార్కు లో సీఎం ఐటీ టవర్ ను ప్రారంభించనున్నారు. ఈ పార్కులో మొత్తం మూడు టవర్ లు నిర్మిస్తుండగా, ఆందులో మొదటిది పూర్తి కావడంతో దానిని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ జి రామయ్య చెప్పారు. టవర్ నిర్మాణ పనులను ఆయన ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో కలసి పరిశీలించారు.
News Posted: 21 January, 2010
|