శ్రీకాకుళం : ప్రముఖ పుణ్య క్షేత్రం అరసవెల్లి సూర్య దేవాలయంలో రథసప్తమి శుక్రవారం వేడుకలు అత్యంత వైభవోతేంగా ఆరంభమయ్యాయి. సూర్యుడు మకరరాశిలోని ప్రవేశించిన తర్వాత మాఘమాస శుద్ధ సప్తమిని రథసప్తమిగా పేర్కొంటారు. స్వామి నిజరూప దర్శన పూజలతో భక్తులకు నవగ్రహ దోష నివృత్తి జరిగి ఆరోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే నిజరూప దర్శనంలో కనిపించే ఆదిత్యుడుని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్ధం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.