విజయవాడ : బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఈ రోజు నుంచి ఆర్జిత సేవలన్నింటిని అమ్మవారి సన్మిధిలోకి మార్చినట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి విజయ్ కుమార్ తలిపారు. అలాగే రథసప్తమి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో గో పూజ ఉత్సవం ప్రారంభమైంది. ఇకపై ప్రతీరోజు అమ్మవారి సన్నిధిలో గోపూజ ఉత్సవం నిర్వహించనున్నారు. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానృసింహా భారతీస్వామి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.