గుంటూరు : ముఖ్యమంత్రి రోశయ్య తెనాలి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ప్రాధమికంగా పర్యటన ఖరారైంది. అయితే ఆయన ఏ మార్గంలో ప్రయాణిస్తారనేది ఖరారు కాలేదు. అయితే 28న ఆయన తెనాలిలో సాయంత్రం బోస్ రోడ్ లోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీ రాములు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అదే రోజున సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆనంతరం ఆయన తెనాలి ఉత్సవ పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అదే రోజున కూరగాయల మార్కెట్ కు కూడా శంఖుస్ధాపన చేస్తారు.