'తెలుగు భాషను కాపాడాలి'
విజయవాడ : తెలుగు భాషను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా రచయతల సంఘం డిమాండ్ చేసింది. అంతేగాక ఈ మేరకు ఆ సంఘం తీర్మానం కూడా చేసింది. నగరంలో కే ఎల్ రావు భవనంలో గత రెండు రోజులుగా జరుగుతున్న సదస్సు మంగళవారంతో ముగిసింది. పరవస్తు చిన్నయ సూరి సాహితీ పీఠం, కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయక్తంగా కలసి ఈ సదస్సును నిర్వహించాయి. ప్రస్తుతం వస్తోన్న రచనల్లో తెలుగు ప్రాధాన్యం తగ్గిపోతోందని సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. రచయతలు ఆంగ్ల ప్రభావం నుండి బయటపడాలని సదస్సుకు హాజరైన వక్తలు పిలుపునిచ్చారు. తెలుగు భాషకు పునరుజ్జీవం కల్పించేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని సదస్సులో తీర్మానం చేసారు.
News Posted: 26 January, 2010
|