విశాఖపట్నం : జిల్లాలోని భీమిలి మున్సిపాల్టీ చైర్ పర్సన్ ఎన్నికకు నగరా మోగింది. ఫిబ్రవరి 6 న ఎన్నిక తేదీ ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 2005లో జరిగిన ఎన్నికల్లో మహిళలకు ఈ స్థానం రిజర్వు కావడంతో తెలుగు దేశం పార్టీకి చెందిన కొప్పుల ప్రభావతి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. అయితే మూడేళ్లు తరువాత కౌన్సిల్ లో ఆమెపై అవిశ్వాశ తీర్మానం ప్రవేశపెట్టడంతో పదవీచ్యుతులయ్యారు. తనపై అవిశ్వాశ తీర్మానం పెట్టడాన్ని సవాలు చేస్తూ ప్రభావతి హైకోర్టులో కేసు వేసారు. ఈ పిటీషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఇపుడు తాజాగా మళ్లీ చైర్ పర్సన్ ఎన్నికకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది.