'కల్తీ సారా ప్రభుత్వ పుణ్యమే'
గుంటూరు : ధరలను స్ధిరీకరించేందుకు 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి డిమాండ్ చేసారు. ధరలను నియంత్రించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని ఆయన మండిపడ్డారు. కల్తీ సారా ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని చిరంజీవి డిమాండ్ చేసారు. గుమ్మడి మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన తన సంతాపం వ్యక్తం చేసారు.
News Posted: 26 January, 2010
|