తిరుపతి : సమైక్యాంధ్ర కోసం ఆత్మహత్యకు పాల్పడిన తుపాకుల బాబు ఆత్మ శాంతించాలని నగరంలో శాంతి ర్యాలీలు నిర్వహించారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సాగిన ఈ శాంతిర్యాలీలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన దేశ నాయకుల విగ్రహాల వద్ద సంతాప సభలను ఏర్పాటు చేసి బాబుకి నివాళులు అర్పించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాబు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తామని సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు వెల్లడించారు.