ఏయూలో కొత్త కాలేజీలు
విశాఖపట్నం : ఆంధ్రాయూనివర్శిటీ క్యాంపస్ లో మరో రెండు కొత్త కాలేజీలు ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. క్యాంపస్ లో మహిళా కాలేజీ, ఫార్మసీ కాలేజీలు ఏర్పాటు చేయాలని వర్శిటీ యాజమాన్యం ఏఐసీటీఈకి ప్రతిపాదనలు పంపింది. వీటికి అనుమతి లభిస్తే ఈ ఏడాది నుండే మహిళా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించాలని వర్శిటీ యాజమాన్యం యోచిస్తోంది. ఈ కాలేజీలో వివిధ గ్రూపులలో సుమారు 200 సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ పద్దతిలోనే భర్తీ చేయాలని, తద్వారా ఆర్ధిక వనరులను మెరుగుపరుచుకోవాలని అధికారులు యెచిస్తున్నారు.
News Posted: 27 January, 2010
|