శ్రీకాళహస్తి : శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కళహస్తేశ్వర ఆలయ ఈఓ రామచంద్ర మూర్తి అధికారులకు సూచించారు. ఉత్సవాలు పురస్కరించుకొని పరిపాలనా బవనంలో అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఉత్సవాలు విజయవంతం చేయడాన్ని ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఏర్పాట్లపై రూపోందించిన ప్రణాళికల ప్రకారం అందరూ నడుచుకోవాలని ఆయన కోరారు.