తిరుపతి : పోలీసులమని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నకిలీల ఆట కట్టింది. జిల్లాలోని కుప్పం మండలంలోని ఇద్దరు వ్యక్తులు పోలీసులమని చెప్పుకుంటూ ఆ ప్రాంతంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాగే గురువారం చెన్నై నుండి వస్తున్న లారీని ఆపి డ్రైవర్ ను డబ్బులు అడిగారు. దీంతో అనుమానం వచ్చిన డ్రైవర్ సమీపంలోని పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. పోలీసులు రంగంలోకి దిగి నకిలీలను అదుపులోకి తీసుకున్నారు.