టిటిడి చైర్మన్ సంకల్పం
తిరుపతి : మన రాష్ట్రం, దేశం శాంతి సౌఖ్యాలతో ప్రశాంతంగా ఉండాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు సంకల్పం చెప్పారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో టిటిడి నిర్వహిస్తున్న అష్టోత్తర శత కుండాత్మక మహా శాంతి యాగం రెండో రోజు శుక్రవారంనాడు ఆయన పాల్గొన్నారు. ఈ పవిత్ర యాగం సందర్భంగా ఋత్విక్కులు వేదమంత్రాలు వల్లించారు. మానవులకు శాంతి, సౌభాగ్యం, సంతోషాన్ని కలిగించాలని దేవతలను మెప్పించేందుకు ఈ యాగాన్ని నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ ఐవైఆర్ కృష్ణారావు, టిటిడి బోర్డు సభ్యులు డాక్టర్ ఎం. అంజయ్య, అల్లూరు సుబ్రమణ్యం, సంయుక్త కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఎన్. యువరాజ్, ఎస్వీ వేదిక్ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ సుదర్శన్ శర్మ, టిటిడి అధికారులు సుధాకర్ రావు, నాగేశ్వరరావు, శ్రీమతి ఝాన్సి, టిటిడి వైఖానస ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు, శ్రీనివాసాచార్యులు, 150 మంది వేద పండితులు యాగంలో పాల్గొన్నారు.
News Posted: 29 January, 2010
|