'లక్ష్మీ ప్రణతి మేజర్'
గుంటూరు : రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతి మైనర్ కాదని మేజరని తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుని అప్రదిష్ట పాలు చేసేందుకే ఇలాంటి చీఫ్ ట్రిక్స్ చేస్తున్నారని రాజకుమారి ఆరోపించారు. లక్ష్మీ ప్రణతి చిన్నప్పటి నుంచి తనకు తెలుసని పేర్కొన్నారు. ఎన్టీఆర్,లక్ష్మీ ప్రణతిలకు ఎనిమిది కోట్ల ఆంధ్రుల ఆశీస్సులు ఉన్నాయని నన్నపనేని వివరించారు.
News Posted: 29 January, 2010
|