విజయవాడ : నగరంలో శనివారం ఉదయం అపహరణకు గురైన వైష్ణైవి కేసుకు సంబంధించి నలుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద దుండగులు వాహనాన్ని వదిలి వెళ్లారు. తమను గుర్తుపట్టడం వల్లే కారు డ్రైవర్ ను చంపినట్లు వారు వాహనంలో లేఖ వదిలి వెళ్లారు. దుండగుల కోసం స్పెషల్ పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసారు.