మూడు మృతదేహాలు లభ్యం
విశాఖపట్నం : తాండవ రిజర్వాయిర్ లో పడవ మునక ఘటనలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మగిలిన 10 మంది ఆచూకీ గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లా మంత్రి బాలరాజు బాధిత కుటుంబాలను పరామర్శించి, అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా సోమవారం బాధితులను పరామర్శించనున్నారు.
News Posted: 31 January, 2010
|