విశాఖపట్నం : తాండవ రిజర్వాయిర్ లో పుట్టి మునిగి గల్లంతైన వారి కుటుంబాలను ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పరామర్శించారు. గొలుగోండలోని అమ్మపేటకు సోమవారం చిరంజీవి సందర్శించారు. మృతుల కుటంబీకులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అంతేగాక పార్టీ తరుపున ఆయన మృతుల కుటుంబాలకు 25 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేసారు. ప్రభుత్వం కూడా 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్ర మంత్రి చిదంబరం వేసే కమిటీ అన్ని ప్రాంతాల వారి మనోభావాలకు అనుగుణంగా ఉంటుందని ఆయన అన్నారు.