విజయవాడ : చిన్నారి వైష్ణవి కిడ్నాప్ కేసులో అనుమానితులని అదుపులోకి తీసుకొని విచారణ సాగిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ తెలిపారు. తాము విడుదల చేసిన ఊహాచిత్రం ఆధారంగా గాలింపు చర్యలు సాగిస్తున్నట్లు చెప్పారు. వైష్ణవిని క్షేమంగా తీసుకువచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. విచారణలో పురోగతిని సాధిస్తున్నామని త్వరలోనే నిందుతులను పట్టకోగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.