ఇక ఆర్జిత సేవలు పరిమితం
తిరుపతి : తిరుమలేశుని ఆర్జిత సేవలు క్రమబద్దీకరణకు నియమించిన కమిటీ సిఫార్సులు మార్చి 5 నుంచి అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. కమిటీ సిఫార్సుల మేరకు మూల విరాట్టుకు, ఉత్పవర్లుకు జరిగే సేవలేవీ రద్దు చేయటం లేదని టీటీడీ ఈఓ కృష్ణరావు పేర్కొన్నారు. ఎంపిక చేసిన ఈ సేవా కేంద్రాల్లోనూ ఆర్జిత సేవలకు రిజర్వేషన్లు అనుమతిస్తామన్నారు. తిరుమలలో సేవల కోసం ఇంటర్నెట్ ద్వారా బుకింగులు యధాతథంగా జరుగుతాయన్నారు. ఆర్జిత సేవలు కరెంట్ బుకింగ్ మాత్రం రద్దు అవుతుందని చెప్పారు. తోమాల, ఆర్జిత సేవలకు 125 మందికి మించి భక్తులను అనుమతించబోమన్నారు.
News Posted: 2 February, 2010
|