ఒడ్డుకు చేరిన మృత దేహాలు
విశాఖపట్నం : తాండవ జలాశయంలో గల్లంతైన మరో నాలుగు మృత దేహాలు లభ్యమయ్యాయి. నేవీ సిబ్బంది సహాయంతో మృతదేహాలు ఒడ్డుకు చేర్చారు. మృతులు ఎల్ నరేంద్ర, సీ హెచ్ రమణ, సంతోష్ లుగా గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ మొత్తం పది మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మిగతా వారి కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. విశాఖ జిల్లా తాండవ జలాశయంలో ఆదివారం పుట్టి మునిగిన ఘటనలో 12 మంది గల్లంతైన విషయం తెలిసిందే.
News Posted: 2 February, 2010
|