వరంగల్ : మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర హుండీ ఆదాయం లెక్కింపు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఐదు రోజుల పాటు జరగనుంది. ఈ నెల 27 నుండి 30 వరకు ఆసియాలోనే అతి పెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరిగింది. జాతరలో భక్తులు సమర్పించే మొక్కులు కోసం 250 హుండీలను ఏర్పాటు చేసారు. జాతర అనంతరం వీటిని వరంగల్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి తరలించారు. లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ శ్రీధర్ సందర్శించారు. ఈ ఏడాది కోటికి పైగా భక్తులు హాజరైనందున మూడు కోట్ల మేర హుండీ ఆదాయం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.