విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. నాలుగో తేదీన ఆయన ఉదయం కాకినాడ నుండి చంద్రబాబు నర్సీపట్నం చేరుకుంటారు. అక్కడ నుండి గొలుగౌండ మండలంలోని కృష్ణాదేవి పేట వెళతారు. అక్కడ ఏర్పాటు చేసిన సహాయక శిబిరంలో తాండవ మృతుల కుటుంబాలను పరామర్శించి పార్టీ తరుపున ఆర్థిక సహాయం అందిస్తారు. అనంతరం చంద్రబాబు తిరిగి నర్సీపట్నానికి చేరుకుని మధ్యాహ్న భోజనం ముగించి సాయంత్రానికి విశాఖ చేరుకుని అక్కడ జిల్లా పార్టీ సర్వసభ సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం రాత్రికి విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు.