విద్యార్థులకు రిమాండ్
విజయవాడ : ఇద్దరు విద్యార్థినులపై లాడ్జిలో అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులకు రిమాండ్ విధించారు.వీరితో పాటుగా లాడ్జిలో గది అద్దెకిచ్చిన క్యాషియర్ ను కూడా కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. గత నెల 30న శ్రీకాంత్, సత్యనారాయణ, వినోద్ కుమార్ లు గవర్నర్ పేటలోని లాడ్జిలో ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం చేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.
News Posted: 3 February, 2010
|