7న జాబ్ మేళా
చిత్తూరు : నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ నెల 7న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి శేషాద్రి వెల్లడించారు. జిల్లాలోని జేకేసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బ్యాంకింగ్, మార్కెటింగ్, ఇన్సూరెన్స్, ఆటోమొబైల్, పారామెడికల్, ఐటీ, బీపీఓ రంగాలకు చెందిన 15 కంపెనీలు అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు జాబ్ మేలాకు హాజరుకావచ్చని ఆయన సూచించారు.
News Posted: 4 February, 2010
|