విజయవాడ : అయే మీరా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ కేసులో నిందుతుడు సత్యంబాబు తరుపు న్యాయవాదులెవరూ కోర్టుకు హాజరుకాలేదు. ఈ కేసులో సాక్ష్యాలు నమోదు పూర్తయిన తరువాత సాక్షుల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ సత్యంబాబు తరుపు న్యాయవాదులు గతంలో పిటీషన్ దాఖలు చేసారు. అయితే కేసు విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం వాయిదా వేసింది.