విజయవాడ : ప్రతీ ఏటా నిర్వహించే మహిళా ఉత్సవ్ ను ఈ సారి కూడా నిర్వహిస్తున్నట్లు జనశిక్షణ సంస్థాన్ డైరక్టర్ విద్యాకన్నా తెలిపారు. ఈ నెల ఆరు నుండి పదో తేదీ వరకు మొగల్ హాల్ లో జరిగే ఈ ఉత్సవ్ కు50 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలనేది తమ ఉద్దశ్యమని ఆయన వివరించారు.