నిజామాబాద్ : తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నియానకం మళ్లీ నిలిచిపోయింది. వర్శిటీలోని ఆర్ట్స్ విభాగానికి డీన్ గా వ్యవహరిస్తున్న ఎల్ విశ్వశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజులు క్రితం నియమించాలని నిర్షయానికి వచ్చింది. అయితే అనూహ్యంగా ఆయన నియామకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే వీసీ నియామకానికి వేసిన సెర్చి కమిటీని కూడా రద్దు చేసింది. తాజాగా మళ్లీ కమిటీని నియమించి కొత్త వీసీ ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.