శ్రీవారి ఊరేగింపు
తిరుపతి : తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఈ వేడుకలను శనివారం ఘనంగా విర్వహించారు. స్వామి వారిని చిన్న శేషపాన్పు వాహనంపై ఊరేగించారు. తిరుమలలోని చిన్న నాలుగు మాడు వీధుల్లో స్వామివారి ఊరేగింపు ఘనంగా జరిగింది.డిప్యూటీ ఈ ఓ ఝాన్సీ ఉత్సవాలను పర్యవేక్షించారు. ఆలాగే కపిలేశ్వరంలోని ఆలయంలో సూర్యప్రభ వాహనంపై శివుడు, పార్వతిలు ఆశీనులు కాగా తిరు వీధుల్లో ఊరేగిస్తూ ఉత్సవాలు జరిపారు.
News Posted: 6 February, 2010
|