అనంతపురం : పెనుకొండ అటవీ రేంజర్ చంద్రశేఖర్ ఆదివారం 37 పావురాలను వదిలివేసారు. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పావురాలను తరలిస్తున్న వాహనం పట్టుబడింది. దీంతో ఆ పావురాలను వెటర్నరీ వైద్యుడితో పరీక్షలు చేయించారు. ఆ పావురాలు కొలంబియా లిలియో జాతికి చెందినవిగా వైద్యలు తేల్చినట్లు అటవీ రేంజర్ చెప్పారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలోకి పావురాలు వచ్చినందున వాటిని గాలికి వదిలేసినట్లు తెలిపారు.