కాలుష్యంపై అధ్యయనం
విశాఖపట్నం : నగరంలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేకంగా అధ్యయనం జరిపించాలని జిల్లా కలెక్టర్ జె శ్యామలరావు నిర్ణయించారు. సదస్సులో పాల్గొనేందుకు పుణె వెళ్లే ముందు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు, అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ బాధ్యతను విశాఖ నగరాభివృద్ధి సంస్థకు అప్పగించారు. టెండర్లు పిలిచి కన్సల్టెంట్ ను ఖరారు చేయాలని సూచించారు.
News Posted: 8 February, 2010
|