జాబ్ మేళా
విజయవాడ : చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ ఉపాధి అధికారిణి వి హిమబిందు తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో ఉన్న తమ కార్యాలయ ఆవరణలో ప్రత్యేకంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. బీఫార్మసీ,బిఎ, బికాం, బీఎస్సీ, బీసీఎ,బీబీఎం, ఎంకాం, ఎంఎ అభ్యసించిన విద్యార్థులు ఈ మేళాలో పాల్గొనేందుకు అర్హులని ఆమె వివరించారు.వివిధ కంపెనీలు ఈ మేళాలో పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని చెప్పారు.
News Posted: 8 February, 2010
|