గుంటూరు : ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రారంభించిన భువనేశ్వర్-తిరుపతి-భువనేశ్వర్ రైలును ఫిబ్రవరి నెలలో కూడా గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎన్ రంగారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు 0871 భువనేశ్వర్ లో ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి రాత్రి 7:10 గంటలకు విశాఖకు చేరుకుంటుందని పేర్కొన్నారు. అక్కడి నుండి గుంటూరుకు మరుసటి రోజు 9:10కి చేరుతుందని వివరించారు.