కుప్పంలో బాబు
చిత్తూరు : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. సోమవారం ఆయన తన సొంత నియోజరవర్గమైన కుప్పంలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రామాపురం తండాలోని 1.64 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
News Posted: 8 February, 2010
|