విజయవాడ : నగరంలోని గుణదల మేరీమాత ఉత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. దాదాపు పది లక్షల మందికి పైగా భక్తులు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. గుణదల కొండ పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చదిద్దారు. ఏలూరు రోడ్డు ప్రారంభం నుంచి విద్యుత్ దీపాలతో రహదార్లను అలంకరించారు.