ఆలయంలో చోరీ
ప్రకాశం : జిల్లాలోని కారంచేడు మండలంలోని స్వర్ణలో కొలువై ఉన్న కన్యకపరమేశ్వరీ దేవాలయంలో చోరీ జరిగింది. సుమారు 5 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి నగలు దోపీడీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆలయ కమిటీ ఇచ్చిన వివరాలు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
News Posted: 10 February, 2010
|