తిరుపతి : శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుమలలోని కల్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఈ ఉత్సవాలు బుధవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసారు. శ్రీవారు ఈ హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం నాలుగు మాడ వీధుల్లో శ్రీవారి ఊరేగింపు జరిగింది.