'తీరప్రాంత భద్రత పటిష్టం'
విశాఖపట్నం : సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎం పళ్లంరాజు చెప్పారు. మాల్దీవులకు చెందిన పురవి నౌకను మరమ్మతులు చేసిన తూర్పు నౌకాదళం శుక్రవారం ఆ నౌకను అప్పిగించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. తూర్పు, పశ్చిమ తీరాల్లో నిఘాను పటిష్ట పరుస్తామన్నారు. త్వరలో అన్ని లైట్ హౌసుల్లో రాడర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
News Posted: 11 February, 2010
|