16న బదిలీ కౌన్సెలింగ్
విజయవాడ : భార్యభర్తల అంతర జిల్లాల బదిలీలకు సంబంధించిన జీవోను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. దీంతో జిల్లాకు వచ్చే వారు 76 మంది కాగా, జిల్లా నుండి వెళ్లే వారు 50 మందికి పైగా ఉంటారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వీరందరికీ 16న కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా, 19న కొత్త స్థానాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
News Posted: 11 February, 2010
|