గుంటూరు : హైదరాబాద్ లేకుండా తెలంగాణ తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తే ప్రత్యేక తెలంగాణ మరింత ఆలస్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.గురువారం అయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని తెలంగాణ నేతలు యత్నిస్తే రాష్ట్రపతి పాలన వచ్చిన పదేళ్లకైనా తెలంగాణ రాదని అన్నారు. రోశయ్యపై కఠిన వ్యాఖ్యలు చేసిన దామోదర్ రెడ్డిపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. పార్టీలో ఉంటూ సీఎంను విమర్శించడం మంచి పద్ధతి కాదని రాయపాటి హితవు పలికారు.