ఫోటో ప్రదర్శన
చిత్తూరు : పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి దేవాలయంలో ఫోటో ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను ఆలయ కమిటీ చైర్మన్ శాంతారాం జె పవార్ ఈ ప్రదర్శనను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోటో ప్రదర్శన ద్వారా జిల్లా సమగ్ర సమాచారం పొందవచ్చునని ఆయన అన్నారు. శివరాత్రి పండగ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఫోటో ప్రదర్శన ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఏపీఓలు అబ్దుల్ రఫీక్, డివిజనల్ పీఆర్వో వేణుగోపాల రెడ్డి, సూపర్ వైజర్ రామాంజనేయులు, ఏపీఆర్వో విజయసింహా తదితరులు పాల్గోన్నారు.
News Posted: 12 February, 2010
|