16న సీఎం సమీక్ష
విజయవాడ : జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి కె రోశయ్య సమీక్షించనున్నారు. ఈ నెల 16 తేదీన సీఎం సమీక్ష జరపనున్నారని కలెక్టర్ కు వర్తమానం అందింది. జిల్లాలో నెలకొన్న కరువు, రుణాల రీ షెడ్యూల్, ఉపాధి హామీ, విద్య వంటి అన్ని విభాగాల పనితీరుపైనా ఆయన సమీక్ష జరపనున్నారు. 16న సాయంత్రం నాల్గంటలు నుండి ఆరు గంటల వరకు ఈ సమీక్ష జరగనుంది.
News Posted: 12 February, 2010
|