విశాఖపట్నం : కేంద్రం ప్రకటించిన శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల్లో తెలంగాణ ఏర్పాటు అనే పదాన్ని తొలగించాలని శాసనమండలిలో విపక్షనేత దాడి వీరభద్రరావు డిమాండ్ చేసారు. నగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యుపిఎ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజన చేసేందుకు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.