ఘనంగా అవభృతోత్సవం
విజయవాడ :శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అవభృతోత్సవం వైభవంగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినాల్లో భాగంగా ప్రతీ ఏటా ఉత్సవం నిర్వహించటం ఆలయ సంప్రదాయం. ఉత్సవమూర్తులను కొండ నుండి ఊరేగిపుగా కిందకు తీసుకువచ్చి పవిత్ర కృష్ణా నదిలో స్నానాలు చేయించారు. మళ్లీ కొండపైకి తీసుకెళ్లి పూర్ణాహుతి నిర్వహించి స్వామి వారు, అమ్మవార్లకు పవళింపు సేవ చేసారు.
News Posted: 15 February, 2010
|