'జేఏసీ వ్యాఖ్యలు ప్రస్తావిస్తా'
విశాఖపట్నం : ఆంధ్రా వర్తకుల వస్తు, సేవలను బహిష్కరించాలని తెలంగాణ వాదులు చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తప్పుపట్టారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరాయిదేశంలో ఉన్నట్లు వస్తు, సేవల బహిష్కరణకు పిలుపు ఇవ్వటం రాజ్యాంగ విరుద్దమన్నారు. ఈ వ్యవహారాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని స్పష్టం చేసారు. భారతీయులందరిదీ ఒకే జెండా అన్న సంగతి ప్రత్యేక జెండా, ప్రత్యేక రాష్ట్రం అనేవారంతా తెలుసుకోవాలన్నారు. వర్శిటీల ప్రొఫెసర్లు పిల్లలకు పాఠాలు చెప్పకుండా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
News Posted: 15 February, 2010
|