విశాఖపట్నం : గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.హైదరాబాద్ నుండి వస్తున్న ఈ రైలు మంగళవారం తెల్లవారుజామున నర్సీపట్నం సమీపంలోకి చేరగానే మంటలు రేగాయి. డ్రైవర్ హైడ్రల్ బ్రేక్ వేయడం వల్లే ఈ మంటలు చెలరేగడానికి కారణంగా తెలుస్తోంది. స్థానికులు గుర్తించి మంటుల ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ కారణంగా గోదావరి ఎక్స్ ప్రెస్ 15 నిమిషాల ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.