రివాల్వార్ తో లవర్స్
తిరుమల : తిరుమలలో ఓ ప్రేమ జంట నుండి రివాల్వార్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ కు చెందిన నీరజ్ పాండే, నీతూ పాండేలు సోమవారం రాత్రి తిరుమలకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది వీరిని తనిఖీలు చేయగా, రివాల్వార్, రెండు తూటాలు లభ్యమయ్యాయి. అనంతరం వీరిని పోలీసు స్టేషన్ కు తరలించి విచారణ చేసారు. ప్రియురాలు సోదరుడు నుంచి ప్రాణభయం ఉండడంతో తుపాకీని కొనుగోలు చేసినట్లు నీరజ్ పాండే తెలిపారు.
News Posted: 16 February, 2010
|