విశాఖపట్నం : గాజువాకలో పట్టపగలు దోపిడీ జరిగింది. ఎస్ బి ఐ బ్రాంచ్ నుండి ఓ వ్యక్తి సుమారు రెండున్నర లక్షల రూపాయలను డ్రా చేసారు. దీనిని గమనించిన కొందరు దుండగులు ఆ వ్యక్తి పై దాడి చేసి నగదును దోచుకెళ్లారు. దీంతో బాధితుడు గాజువాక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసాడు.