విజయవాడ : ఇంద్రకీలాద్రపై కొలువైన కనకదుర్గమ్మవారికి 32 హుండీల ద్వారా కోటీ13 లక్షల 38వేల 170 రూపాయల కానుకలను భక్తులు సమర్పించారు. భారీగా విదేశీ కరెన్సీ కూడా వచ్చింది. ఆలయ ఈవో ఎన్ విజయకుమర్ పర్యవేక్షణలో ఆలయంలోని పలు విభాగాలకు చెందిన ఉద్యోగులు సోమవారం ఈ హుండీల లెక్కింపులో పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభానికి ముందు రోజు హుండీలను లెక్కించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు.