గుంటూరు : సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీని పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కోస్టుగార్డు డీఐజీ మహ్మద్ అబూతుల్లా పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండో కోస్టుగార్డు పోలీస్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నిజాంపట్నంలో ఈ మేరకు దీనిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 30 ఎకరాల స్థలంలో దీనిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.