చిత్తూరు : తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ప్రపుల్ పటేల్ తెలిపారు. ఈ ఎయిర్ పోర్టుకు ప్రధాని మన్మోహన్ సింగ్ శంఖుస్థాపన చేయనున్నారని ఆయన వెల్లిడించారు. ప్రపంచ ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. బుధవారం ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు.